మన్యం మనుగడ, టేకులపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసుకుంటున్న భూములు పరిశీలించటం జరిగింది. వారికి పట్టాలు ఉన్న రైతు బందు వస్తున్న ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది.పెసా యాక్ట్ ఆర్సీ నెంబర్. 511/2011/TR/PR/ITDA ప్రకారం దళిత పోడు రైతులకు రక్షణ కల్పిస్తూ వారినీ ఇబ్బందులకు గురి చేయకూడదని ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఫారెస్ట్ అధికారులకు 2005 కంటే ముందు నుండి సాగు చేసుకుంటున్న గిరిజన భూములను లాక్కునే హక్కు లేదు. అదే విధంగా జీఓ. నం. 951 ది. 14.12.1974 ప్రకారం 2.20 ఎకరాల లోపు బాడవ భూమి, 5.00 ఎకరాల లోపు మెరక భూమి 18 ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని హరిజనులు కూడా దీనికి అర్హులని జీఓ పాస్ చేయడం జరిగింది. ఇన్ని ఆదేశాలు ఉన్న రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారికి ఇండియన్ కిసాన్ యూనియన్ ఎప్పుడు అండగా ఉంటుందని అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆదుకొనే విధంగా చూడాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇనపనూరి నవీన్, పలగాని శ్రీనివాసరావు, చీమల గోపాల్, సురే సీతారాములు, ఊకే సురేష్, కోరం రాంబాబు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
మద్దిశెట్టి సామేలు
ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్
Post A Comment: