CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పుత్రశోకం తీరని లోటు

Share it:

 


-గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్



మన్యం మనుగడ, పినపాక:



దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ కారణంగా మరణాలు మనుషులను కలిచివేస్తున్నాయని గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కోవిడ్ పాజిటివ్ వచ్చి పుత్రున్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా టిఆర్ఎస్ నాయకులు భవాని శంకర్ ను చరవాణి లో యోగక్షేమాలు అడిగి ఆమె సంతాపాన్ని తెలియజేశారు. గత నెల 31 న కోవిడ్ పాజిటివ్ కారణంగా , చికిత్స పొందుతూ కోలేటి భవానీ శంకర్ కుమారుడు రవి ప్రసాద్ (రాజా)మరణించిన విషయం తెలుసుకొని స్వయంగా ఫోన్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సంధర్బంగా ఆమె తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తానని, వారి ఆత్మీయత అభిమానం ఆదరణ గురించి తెలుపుతూ కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు లయన్స్ క్లబ్ సభ్యులు తార ప్రసాద్, ప్రసాద్ లు పాల్గొని కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: