మన్యంటీవీ,అశ్వారావుపేట:
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట మండలం మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అట్టం రమ్య మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమ్య మాట్లాడుతూ రోజు రోజుకు మారుతున్న పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని అందరం కూడా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం పాటపడాలని వారు తెలిపారు. భారతదేశం మొత్తం పచ్చదనాన్ని పెంపొందించడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చెట్ల పెంపకం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఈవో, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: