మాదంటే మాది అంటూ ఇరువర్గాల వాగ్వాదం
మామ కన్ను గ్రామస్తులు ఫారెస్ట్ అధికారుల పోడు భూముల రగడ
గుండాల ( మన్యం టీవీ) మళ్లీ మొదలైన పోడు రగడ మామ కన్ను గ్రామస్తులు ఫారెస్ట్ అధికారుల మధ్య మాదంటే మాది అంటూ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగినారు. మామ కన్ను 40 మంది గ్రామస్తుల పోడు భూమి ఈ వ్యవహారంలో గతంలో కొంతమంది జైలుపాలయ్యారు. మళ్లీ వర్షాకాలం ప్రారంభం కావడంతో 40 మంది రైతులు 40 నా కళ్ళతో దున్ను కునేందుకు అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో ఫారెస్ట్ అధికారులు సైతం ట్రాక్టర్లతో చేరుకొని కోడి భూమిని దున్నుతున్న ఈ సమయంలో మామ కన్ను గ్రామస్తులు అక్కడకు చేరుకొని మా భూమిని మీరెలా దున్నుతారు అని ఫారెస్ట్ అధికారులతో చర్చలు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు మాత్రం స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఈ భూములపై స్టే ఇచ్చినప్పటికీ అది తప్పుడు తేగా అధికారులు అంటున్నారని మామ కన్ను గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే భూముల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య పెద్ద గొడవ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి కొంతమందిని జైలుకు పంపించడం కూడా జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో 40 మంది భూమిని సర్వే చేయించి తనకు నివేదిక జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని హై కోర్ట్ ఆర్డర్ లో ఉందని గ్రామస్తులు చెప్పినప్పటికీ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు అయిన మా సమస్యను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని మామ కన్ను గ్రామస్తులు వేడుకుంటున్నారు
Post A Comment: