గుండాల ( మన్యం టీవీ) కరోనా పేషెంట్లకు గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని కోడిగుడ్డుతో కూడిన భోజనాన్ని అందజేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో కరోనా పేషెంట్ల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. శనివారం నాడు ఇద్దరు ఈ కేంద్రంలో జైన్ అయ్యారు వారికి రెండు పూటల కోడుగుడ్డు తో కూడిన భోజనాన్ని అందజేశారు. ఈ భోజన కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు కొనసాగిస్తానని సంధాని పేర్కొన్నారు .కరోనా బారిన పడినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు .మంచి ఆహారం తీసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న మందులను వాడాలని సూచించారు
Post A Comment: