అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మోకాళ్ళ వెంకటేశ్వరరావు
మన్యం మనుగడ,భద్రాచలం టౌన్:
బండారు చందర్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసోలేషన్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ యం. వెంకటేశ్వరరావు సందర్శించారు.శనివారం ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించి రోగులతో మాట్లాడారు.అదేవిధంగా రోగులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. ఐసోలేషన్ కేంద్రంలోని రోగులకు అందుతున్న వసతి సౌకర్యాలను ఆయన పరిశీలించారు .అదే విధంగా కేంద్రంలోని రోగులకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి సి ఆర్ ట్రస్ట్ ఐసోలేషన్ కేంద్రం నిర్వాహకులను ఆయన అభినందించారు.బి సి ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అందజేస్తున్న సేవలు చాలా అభినందనీయమని ఆయన ప్రశంసించారు.
Post A Comment: