మన్యం టివి మణుగూరు:
ఏఐసిసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ 51 వ జన్మదిన వేడుకలు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందించారు.ఈ వేడుకల్లో భద్రాచలం ఎమ్మెల్యే పాల్గొని,హెల్త్ క్యాంపు ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు వారసుడైన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పేదల పక్షాన ఉండి పోరాటాలు చేస్తామన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల సరికాదన్నారు.వర్షాకాలంలో రోగాలు ఎక్కువగా వస్తాయి అన్న ఉద్దేశంతో గ్రామం నిర్వహించామని తెలిపారు. గతంలో ఈ గ్రామంలో చాలామంది డెంగ్యూ, మలేరియా రకరకాల విష జ్వరాలతో చనిపోయారని, అందుకే కొత్త మల్లే పల్లి గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. హెల్త్ క్యాంపు కు సహకరించిన డాక్టర్లు రమేష్ చంద్ర,శశిధర్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ చందా.సంతోష్,కో కన్వీనర్ గురజాల గోపి, పట్టణ అధ్యక్షుడు నవీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి,నాయకులు లక్ష్మణ్, నూరుద్దీన్,సాంబశివరావు, రామ్మూర్తి,షరీఫ్,సాంబశివరావు,రాములు,విజయలక్ష్మి,వరలక్ష్మి,షబానా,సౌజన్య, రజిని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: