CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు

Share it:

 


జెండాను ఎగురవేసిన మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి

మన్యం మనుగడ, పినపాక: పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 8వ రాష్ట్ర అవతరణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పినపాక టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. తదనంతరం జాతీయగీతం ఆలపించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి, అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణలో కేసిఆర్ పరిపాలనలో, రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోంది అని అన్నారు. అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక రూపంలో విమర్శలు చేస్తూ కాలాన్ని వెలిబుచ్చుతున్నారు అని అన్నాడు. ఇప్పటికైనా అటువంటివారు కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రం సాధించే అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోపినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ, ఆత్మ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసు బాబు, పోలిశెట్టి సత్తిబాబు, బొలిశెట్టి నరసింహారావు, కొండేరు రాము తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: