మన్యం టీవీ మణుగూరు:
మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యం లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పినపాక నియోజకవర్గ కన్వీనర్ డా.చందా సంతోష్ కుమార్ హాజరై జాతీయ జెండా ఎగురావేసి జాతీయ గీతం ఆలా పించి జై తెలంగాణ.జై కాంగ్రెస్.అని నినదించారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మరియు కో కన్వీనర్ గురిజాల గోపి,పట్టణ అధ్యక్షులు నవీన్,నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి,జిల్లా మహిళా కార్మిక శాఖ అధ్యక్షురాలు బోగినేని వరలక్ష్మి,ఎస్టీ సెల్ అధ్యక్షులు కొమరం రామ్మూర్తి,బీసీ సెల్ నాయకులు కోడేం. సాంబశివరావు,జాయింట్ సెక్రెటరీ లు ఎండి షరీఫ్, పాల్వంచ రాములు, పగిడిపల్లి శ్యామ్,సీనియర్ మహిళా నాయకురాలు ఎండి షబాణ.ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: