మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణుగూరు మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ చంద్ర శేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల ప్రజలకు తహసీల్దార్ చంద్ర శేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమరులకు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి,ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ పి. వెంకటేశ్వర్లు,ఎంపీటీసీల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ఎంపీటీసీ కణితి బాబురావు,తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: