CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రహదారి సౌకర్యం కల్పించండి

Share it:

 



 వినతి పత్రం  అందించిన ప్రజా ప్రతినిధులు 

   గుండాల      ( మన్యం టీవీ)రహదారి సౌకర్యం కల్పించాలని  కొత్తగూడెం జిల్లా కలెక్టర్  అనుదీప్ కు గుండాల ప్రజా ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. గుండాల జెడ్ పి టి సి   రామఅక్క,  వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన  కలెక్టర్ అనుదీప్, మటన్ లంక రహదారిని పరిశీలించారు. వినతి పత్రం లో వారు మరికొన్ని  సమస్యలను విన్నవించుకున్నారు.  మండలంలోని కన్నాయిగూడెం రహదారికి  బిటి రహదారిని మంజూరు చేయాలని  విజ్ఞప్తి చేశారు. దానితోపాటు అదనపు అదనపు  వైద్యుడిని కేటాయించాలని కోరారు. కరోనా కాలంలో ఎంతో ఉపయోగపడే ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు   కలెక్టర్ కు ధన్యవాదాలు అని అన్నారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో  నాయకులు. అరెం నరేష్, ఈ సం కృష్ణ , మానాల ఉపేందర్,   పీ వై ఎల్ నాయకులు రవి ,   బుచ్చయ్య తదితరులు తదితరులు పాల్గొన్నారు మన్యం టీవీ

Share it:

TELANGANA

Post A Comment: