గుండాల (ఆళ్ల పల్లి) ( మన్యం టీవీ) కరోనాతో కాంగ్రెస్ నాయకుడు మృతి చెందిన సంఘటన ఆళ్ల పల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో చోటు చేసుకుంది. మర్కోడు ఎంపీటీసీ కొమరం వేణి భర్త కొమరం అనిల్ (36)గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. గత 6 రోజుల క్రితం కరోనా నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం లోని ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మర్కోడు గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలను నిర్వహించారు. మర్కోడు గ్రామానికి చెందిన యువకులు ముప్పిడి రాంబాబు , రణం మల్లికార్జున్ , కొమరం వెంకట కృష్ణ , కొమరం వెంకటేష్ లు పీ పీ ఇట్లు ధరించి అంత్యక్రియలను నిర్వహించారు. ఇంటికి పెద్ద దిక్కు కరోనాతో మృతిచెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి
Post A Comment: