ఎంపీటీసీ వేముల భారతి
మన్యంటీవీ,అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలంలో అనేక సేవాకార్యక్రమాలతో జూనియర్ సీతక్కగా గుర్తింపు తెచ్చుకొని అనునిత్యం ప్రజల్లో వుంటున్నటువంటి ప్రముఖ ఎంపీటీసీ వేముల భారతి ఈరోజు తను రాజకీయ ప్రస్థానం రెండుసంవత్సరాలు పూర్తిచేసుకొని మూడవ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని తనతో పాటు విజయం సాధించినటువంటి ఎంపీటీసీ సభ్యులకు నియోజక వర్గ జడ్పీటీసీ లకు శుభాకాంక్షలు తెలియజేసారు, అలాగే ఆమె మాట్లాడుతూ తనను ఎంతో నమ్మకంతో గెలిపించినటువంటి మొదటి సెగ్మెంట్ ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని ఈరెండు సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ కాలంలో కరోనా తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సేవచేయడం సంతృప్తి నిచ్చిందని అలాగే రానున్న రోజుల్లో మరిన్ని సేవలు చేయాలనీ ఉందని దానికి ప్రజల అండదండలు ఎప్పటికి ఇలాగే ఉండాలని ఆమె అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీటీసీ లకు అభివృద్ధి పరంగా ఎలాంటి నిధులు లేకపోవడం దురదృష్టకరం అదే ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటే ఎంపీటీసీ సైతం సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని ఆమెతెలిపారు.
Post A Comment: