వత్సవాయి శ్రీధర్ వర్మ
మన్యం టీవీ మంగపేట.
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మంగపేట మండలం లో గల అకినేపల్లి మల్లారం గ్రామ పంచాయతీ కార్యాలయము నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ మరియు ములుగు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజమల్ల సుకుమార్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంట భగీరథ ,టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల నాయకులు డబ్బుల ముత్యాలరావు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రూప భద్రయ్య ,కారోబార్ చెట్టిపల్లి వెంకన్న, వాటర్ మాన్ సీతారాములు, ఆనంద్ ,అంగన్వాడి టీచర్లు సరళ జక్క వజ్రం మేరి పద్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: