మన్యంటీవీ, అశ్వారావుపేట:
ప్రస్తుత లాక్డౌన్లో చాలా మందికి ఆకలి తీర్చిన సోమాని శ్రీను & ఉపసర్పంచ్ కేదార్నాద్ ఇప్పుడు మరోసారి కోవిడ్ బాధితులు వారి బందువుల ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వాళ్ళ కోసం ప్రేత్యేకంగా వాట్సాప్ కోవిడ్ సర్వీస్ గ్రూప్ పెట్టి సోమాని శ్రీను వాళ్లకు పలు సూచనలు ఇస్తూ, మనోధైర్యం చెబుతూ కావలిసిన సహాయ, సహకారాలు చేస్తున్నారు. ఒక్క ఫోన్ (కేదార్నాద్) 97045 28844..(సోమాని శ్రీను )90008 82883 కాల్తో కోవిడ్ భాదితుల ఇంటికే అహరం చేరేలా ప్రణాళిక చేశారు. సోమాని శ్రీను, ఉపసర్పంచ్ కేదార్నాద్ అశ్వారావుపేట భామబూమ్ సహాయ, సహకారం ద్వారా ఆహర పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది, ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో అను నిత్యం కోవిడ్ బారిన పడిన చాలా మందికి ఆహరం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సోమాని శ్రీను & ఉపసర్పంచ్ కేదార్నాద్ ఇప్పుడు కూడా కోవిడ్ బాధితులకు భామబూమ్ ద్వారా అహరం అందిస్తామని భామాబూమ్ వాహనాలతో పుడ్ ప్యాకేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా మని ఇక కష్టాల్లో ఉన్నా వారు వంట చేసుకునే పరిస్థితులు లేక, పౌష్టికాహారం తినలేక ఇబ్బందిపడుతున్న వాళ్లకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటున్నారు.
Post A Comment: