CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన పెట్రోల్ ,డీజిల్ ధరలు తక్షణమే వెంటనే తగ్గించాలి: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ ఎక్స్ జెడ్పిటిసి ఇల్లందు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కృష్ణమూర్తి అలియాస్(ఎల్లన్న ) విజ్ఞాన భవన్ లో శనివారం జరిగిన సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ పాల్గొని మాట్లాడుతూ. . కరోనా మాటున దేశంలో రాష్ట్రంలో పెద్ద దోపిడి జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తు దారునికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఉపాధి కోల్పోయిన కార్మికులు సామాన్యులు మధ్యతరగతి పేద ప్రజలు వస్తువులు కొన్న లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరల తో పాటు ధరలు తగ్గించాలని ఆమె అన్నారు. కరోనా బాధ్యులను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని గ్రామంలో పట్టణంలో కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిత్య అవసర సరుకులను అయినటువంటి నూనె ధరలు అధికంగా రేట్లు పెట్టి మధ్యతరగతి వాళ్లము మెయ్యలేని భారంగా ఉందని తక్షణమే రేట్లు తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: