మన్యం టీవీ ఏటూరు నాగారం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బుధవారం ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం నందు పీవో హనుమంతు కె. జెండాగే ఐఏఎస్, ముందుగా జయశంకర్ సార్ మరియు తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసు వారు ఇచ్చే గౌరవం వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పి గౌస్ ఆలం ఐపీఎస్, ఐటీడీఏ పీవో జనరల్ వసంతరావు, ఎస్ డి సి శ్రీరాములు, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు మంకిడి ఎర్రయ్య, జిసిసి డిఎం ప్రతాప్ రెడ్డి, ఐటిడిఎ ఎవో రఘు, ఐటీడీఏ మేనేజర్ లాల్ నాయక్, ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, వివిధ శాఖల ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: