మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లోని లక్ష్మినర్సాపురం, రాజుపేట గ్రామాల్లో కోవిడ్ బాధితులకు ములుగు జయశంకర్ భూపాలపల్లి సబ్ రిజిస్టార్ మహమ్మద్ తస్లీమా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా సబ్ రిజిస్టార్ తస్లీమా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కోవిడ్ బారిన పడిన ప్రజలకు సరి అయిన పోషక ఆహరం లభించడం లేదు రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు కోవిడ్ తో చాలా బాధలు పడుతున్నారు అటువంటి వారికి దాతలు ముందుకు వచ్చి వారి వారి స్థోమత మేరకు చేయూతనివ్వాలని త్వరలోనే మరల మనందరికి మంచి రోజులు వస్తాయని అంతవరకు ప్రజలు స్వయం నియమ నిబంధనలతో అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదు, వస్తే భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైసర్ వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు ఈ సందర్బంగా సూచనలు చేసారు.
Post A Comment: