మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను మండల అధ్యక్షులు సునీల్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ జెండాను టౌన్ ప్రధాన కార్యదర్శి లోటపెటల రాజేష్ లు జెండాలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల చేతిలో అణగారి పోయిన తెలంగాణ ప్రాంతంలో శాంతియుత, గాంధేయ, అహింసా మార్గంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించి చివరకు రాష్ట్రంను సాధించుకున్నాం, రాష్ట్రంలో 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పథకాలను నిరాటకంగా కొనసాగిస్తూ బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దుట కు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ వాలియబీ సలీం, ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా, పిఏసిఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నూతి కృష్ణమూర్తి, తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామనర్సయ్య, ఎండి ఖలీల్,కునురు మహేష్, కోమిరి రమేష్, కొండాయి చిన్ని, వావిలాల రాంబాబు, ఎండి ఖాజా పాషా, కర్రీ రవీందర్, తాండ్ర సతీష్, పెండ్యాల ప్రభాకర్, జాడి బోజా రావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: