మన్యం టీవీ వాజేడు.
సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్
కరోనా బాధితులకు,నిరుపేదలకు సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ
వాజేడు : కరోనా వైరస్ తో అయినవారిని కోల్పోయి నిరాశ్రయులు అయిన కుటుంబాలకు బాసటగా నిలుద్ధాం అని సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ వ్యవస్థాపకులు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలునిచ్చారు,ఆదివారం వాజేడు మండలంలో సిఐ శివ ప్రసాద్ తో బాధితులకు,నిరుపేదలకు బియ్యం,నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేశారు, లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి పేద ప్రజలకు చేయూతనివ్వాలని తస్లీమా కోరారు, వాజేడు మండలంలోని చేరుకురు,వాజేడు,గణపురం, బోల్లారం గ్రామాలలో 120 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు,కూరగాయలు అందజేశారు,ప్రస్తుత విపత్కర పరిస్థితులలో మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ మనో నిబ్బరంతో ఉండాలని తస్లీమా అన్నారు,లాక్ డౌన్ లోడ్ లో ఒక్కరు కూడా అర్ధాకలితో ఉండాలని ఆమె అన్నారు,తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు అరుణ క్వీన్,సత్య రాపెల్లి,మామిడి పెల్లి రమేష్,లావుడ్య సుక్రం,భాను ప్రకాష్, చంటి సామ్యూల్,మార్త శ్రీనివాస్, అత్తీని శ్రీకాంత్, బుర్ర రత్నాకర్,గడ్డం బన్ని, పుణెం సాయి తేజ, యాలం కోటేష్,జవ్వ రాంబాబు,సాయి తదితరులు ఉన్నారు.
Post A Comment: