మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల కేంద్రంలో ఎరువులు పురుగు మందుల దుకాణాల ను అశ్వాపురం సిఐ సట్ల రాజు, మండల వ్యవసాయ అధికారి సాయి శంతన్ కుమార్ లు తనిఖీ చేశారు. సీఐ, వ్యవసాయ అధికారి దుకాణాలలో పురుగుమందులు ఎరువుల అమ్మకాలపై రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గా సీఐ, వ్యవసాయ అధికారి మాట్లాడుతూ దుకాణాలలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే రైతులు తమకు సమాచారం అందించాలన్నారు.
Post A Comment: