మన్యం మనుగడ,కరకగూడెం:కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు
సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు అందరు కలిసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించి నందుకు చాలా సంతషించారు. ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ అందరం కలిసి కట్టుగా పనిచేయాలని, 2023 లొ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేయడం ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఊకే రామనాథం, బట్టుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ తోలెం నాగేశ్వరావు, మండల సీనియర్ నాయకులు గోగ్గలి నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి నాగబండి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బరిశెట్టి రామారావు, మండల యువజన అధ్యక్షులు సాగర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: