మన్యం టీవీ కరకగూడెం : ఏజెన్సీ కరకగూడెం మండలంలోని కరకగూడెం గ్రామపంచాయతి పరిధిలో సీతారాంపురం గ్రామాల్లో కరోనా నిర్ధారణ అయిన కరోనా బాధితులకు అంగన్వాడీ టీచర్ రేగా రమ,టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు.
కరోనా వైరస్ బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని,వారి పట్ల వివక్షత చూపవద్దని సూచించారు.కరోనా వైరస్ బాధితులు భయపడకుండా డాక్టర్లు చెప్పిన సూచనలు,సలహాలు పాటించాలని తెలిపారు.
Post A Comment: