మన్యం మనుగడ పినపాక : నూతనంగా వివాహం అయిన దంపతులు గండ్రాతి సతీష్ -శిరీషలు వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.
పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన అరవ కొరిక్షిత (2 సంవత్సరాలు) కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధ పడుతుంది. ఆ చిన్నారి తల్లి తండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కడు పేదరికంలో ఉండి ఆ చిన్నారిని హాస్పిటల్స్ లో చూపించుటకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న
ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన గండ్రాతి సమ్మయ్య - వెంకటరమణ కుమారుడు ప్రస్తుతం పాలకుర్తి ఎస్ఐగా పని చేస్తున్న గండ్రాతి సతీష్ తన వివాహం అయిన సందర్భంగా ఆ చిన్నారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయిల ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో గండ్రాతి సతీష్ కుటుంబసభ్యులు గండ్రాతి ప్రవీణ్, గండ్రాతి రామ్కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, బత్తుల వెంకట్ రెడ్డి, గీద శేఖర్, బూర రమేష్, యాంపాటి సందీప్రెడ్డి, గుండు రవి, గీద సత్యనారాయణ,గీద సంపత్ ,గీద వంశీ, తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: