మన్యంటీవీ, అశ్వారావుపేట:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రజల క్షేమం కోసమే పని చేస్తుందని, నిరుపేదల కోసం కరోనా సమయంలో కూడ అన్ని రకాలా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తుందనీ అందులో భాగంగానే అశ్వారావుపేట మండలంలోని గిరివికాస్ పథకంలో రైతులకు 53 ఉచిత బోర్లు వేసేందుకు నిధులు మంజూరు అయ్యాయని, బోరు వేయటానికి ప్రభుత్వం ఒక్కొక దానికి సుమారు 2.50 వేలు రూపాయలను వెచ్చించి గిరిజనుల కోసం ఈ బోరు వేయటం జరుగుతుందని, ఐతే ఈ బోరు వేయటానికి ఇద్దరు రైతులకు కలిపి మొత్తం 5 ఎకరాల పైన పొలం కలిగి వున్న వారు ఈ పథకానికి అర్హులు అవుతారని తెలిపారు. అలా అర్హులు కల రైతులు సుమారు 5 యకరాలు పొలం వుండే ఇద్దరు రైతులకు ఒక్కొక బోర్ సెక్షన్ అవ్వటం జరిగిందని అందులో భాగంగా మొదటి విడత గా 23 బోర్లను వేస్తున్నారని, మొదటగా రెడ్డిగూడెం గ్రామంలో వెయ్యడం జరుగుతుందని తెలుపుతూ అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల తెరాస పార్టీ అద్యక్షులు బండి పుల్లారావు, జెడ్పీటీసీ చిన్నంసెట్టి వరలక్ష్మీ, ఏంపీడిఓ పి.విజయ, నియోజక వర్గ నాయకులు జారే ఆదినారాయణ, స్థానిక సర్పంచ్ లు, విఆర్ఓ లు, సెక్రెటరీ లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: