మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో దోమతెరలు పంపిణీ చేయడం జరిగింది. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం నుండి దోమతెరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనది అని ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శివ కుమార్, డాక్టర్ ప్రసాదు తెలియజేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున బురద గుంతలు ఏర్పడి, దోమల కారణంగా మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున, ముందస్తుగా ఇచ్చే దోమ తెరలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎంపీపీ గుమ్మడి గాంధీ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండలం వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఎంపీటీసీ చింతపంటి సత్యం, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: