మాజీ ఎంపీ పొంగులేటి
డాక్టర్_ల_సేవలు_వెలకట్టలేనివి
👉ప్రభుత్వ_ఆస్పత్రిలో_పీపీఈ_కిట్ల_పంపిణీ_చేసిన_పొంగులేటి_శ్రీనన్న
మన్యం మీడియా డెస్క్:
(కొత్తగూడెం): కరోనా మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచారని ఖమ్మం మాజీ ఎంపీ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.కొత్తగూడెం ఆసుపత్రిని సందర్శించి అందులో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను మాజీ ఎంపీ పొంగులేటి పరిశీలించారు కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు 1000 పీ పీ ఈ కిట్లను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న డాక్టర్ల కృషి వెలకట్టలేనిది అన్నారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు కోవిడ్ మహమ్మారిని అరికట్టడంలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుందన్నారు. ఎంతటి కష్టతరమైన పరిస్థితుల్లో ఏర్పడినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఒకవైపు కరోనాను కట్టడి చేసుకునే మరోవైపు ప్రజలకు ఉచిత బియ్యం నగదు సాయం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్ర శేఖర్ రావు , పాల్వంచ పట్టణ అధ్యక్షులు ముంతపురి రాజు గౌడ్ గారు,తెరాస నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులుగారు , యర్రంశెట్టి ముత్తయ్య, తుమ్మల శివారెడ్డి, జలగం మధు గారు, బుడగం నాగేశ్వరరావు , కాంపెళ్లి కనకేశ్ , బాలినేని నాగేశ్వరరావు , యర్రంశెట్టి మధు, చీకటి కార్తీక్ , ఇజ్జగాని రవిగౌడ్ , సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, చికాకుల భాస్కర్ , పసుపులేటి ప్రభాకర్ , కుషాల్ , చింతా నాగరాజు , ఆళ్ల మురళి , తాండ్ర నాగబాబు, టీబీజీకేయస్ నాయకులు రజాక్ , సోమిరెడ్డి గారు, విప్లవరెడ్డి , భూపతి శ్రీను , బత్తిని రాజశేఖర్ తదితలురు పాల్గొన్నారు.
Post A Comment: