మన్యం మనుగడ, పినపాక: పినపాక మండలం లో నిజాం పేట గ్రామానికి చెందిన అభివృద్ధి సేవా సొసైటీ ఆధ్వర్యంలో రోగులకు సేవలు అందించే సహాయం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆదివారం నాడు జానంపేట గ్రామంలోని కరోనా సోకిన కుటుంబాలకు నిత్యావసరాలను అందించడం జరిగింది. మాకు తోచిన మేరకు ఈ సహాయాన్ని కొనసాగిస్తూనే ఉంటామని అభయ్ దళిత్ సేవా సొసైటీ సభ్యులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో అభయ్ దలిత్ సేవా సొసైటీ అధ్యక్షులు కుమ్మరి వెంకటేశ్వర్లు ,ఉపాధ్యక్షులు వీర్రాజు, కోశాధికారి మాధరి రాజు ,సెక్రెటరీ బాబురావు , కార్యనిర్వాహణాధికారి దేపాక శివ ,జీవన్ ,కొండయ్య , నరసింహారావు ,నరేష్ ,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: