ఎంపీడీఓ శ్రీనివాసులు
మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలంలో ఏ గ్రామంలో కూడా నివాస ప్రాంతాలలో వర్షపు నీరు నిలువకుండా సర్పంచులు సెక్రటరీలు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఆయన
ఏడూళ్ళ బయ్యారం పంచాయితీలో పర్యటించి పోతురెడ్డిపల్లి గ్రామంలో ఎంతో కాలంగా కిందిగుంపు ప్రజలు వర్షకాలంలో వరదలు వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని, ఆ గ్రామానికి రాకపోకలు కోసం ఇనుప వంతెన నిర్మించడానికి ప్రాంతాన్ని పరిశీలించి, వంతెన నిర్మాణం కొరకు గ్రామపంచాయతి ద్వారా తీర్మానం చేయాలని కార్యదర్శి హరీష్,సర్పంచ్ కోరం రజినికి సూచించారు. గ్రామంలో ఎక్కడ కూడ రోడ్డు పై వర్షపు నీరు నిలువ కుండా కాలువలు ఏర్పాటు చేయాలని అదేశించారు. ఈ కార్యక్రమం లో పంచాయితీరాజ్ ఏ. ఈ వెంకట్,తెరాస మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస రెడ్డి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: