CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు ఆధ్వర్యంలో ఉడుగుల గణేష్ కుటుంబానికి 25 కేజీ ల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మణుగూరు మండలం,సాంబాయి గూడెం గ్రామా పంచాయతీ పరిధిలోని 8వ వార్డ్ లో నివసిస్తున్న ఉడుగుల గణేష్ కు ప్రమాద వశాత్తూ ట్రాక్టర్ కింద పడి కాలు విరిగింది,2 సంవత్సరాల క్రితం  ఆపరేషన్ చేయించినా, ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ ఆపరేషన్ చేయించాలని డాక్టర్ లు సూచించారు.కానీ నిరుపేద కుటుంబం కావడం తో కుటుంబ భారం అవ్వడం మూలాన కాలికి ఆపరేషన్ చేయించుకొలేని పరిస్థితిలో వుండి భాధ పడుతున్న సమయం లో,మణుగూరు మండలానికి చెందిన ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వారిని సహాయం కోరగా వెంటనే స్పందించి  భాదితునికి ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు ఉప్పల శ్రీకర్,దుర్గ ప్రసాద్ స్పందించి 25 కేజీ ల బియ్యం మరియు సంస్థ వారు నిత్యావసర వస్తువులు కూరగాయలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిధులు గా సాంబాయి గూడెం గ్రామ సర్పంచ్ కాయం తిరుపతమ్మ.వార్డ్ మెంబర్ లు పులిగిల్ల రమేష్,జక్కుల రమణ, మరియు ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుగులోత్ రాందాస్ నాయక్,ప్రధాన కార్యదర్శి గుర్రం.శ్రీనివాస్, కోశాధికారి  గుగులోత్ రమేష్,ముఖ్యసలహాదారులు బుర్ర సత్యనారాయణ మూర్తి  సభ్యులు,పరాల మల్లయ్య యాదవ్,గుంజ సాంబ,ఉప్పల శ్రీకర్ దుర్గ ప్రసాద్,వేముల రమణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: