రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని కొండాయిగూడెం గ్రామంలో 15 కుటుంబాలు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసి, వెంటనే మొత్తం 15 కరోనా బాధిత కుటుంబాలకు,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో,తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఉచితంగా వారం రోజులకు సరిపడా నిత్యవసర సరుకుల కిట్ లను శుక్రవారం,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు బోయిళ్ళ.రాజు, మండారి.సతీష్,మాజీ డి సి సి బి డైరెక్టర్.బోయిళ్ళ రమణయ్య,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొగ్గుల నాని,హ్యాండ్ రైటింగ్ హుస్సేన్,యువజన నాయకులు,సూది పోగు నాగరాజు,బోయిళ్ళ శ్రీరామ్ మూర్తి,కరోనా బాధిత కుటుంబాలకు వారి ఇంటికి వెళ్లి,బియ్యం,నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Post A Comment: