మన్యం మనుగడ, పినపాక
ఆడపిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం, సీతంపేట, ఉప్పక, జానంపేట దుగినేపల్లి పల్లి, అమరారం గ్రామాలలో 51 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక రెవిన్యూ ఇన్స్పెక్టర్ వీర్రాజు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ బీసీ సెల్ నియోజకవర్గ నాయకులు పొలిశెట్టి సత్తిబాబు ,రైతు సమన్వయ సంఘం మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, ఏడూళ్ల బయ్యారం సర్పంచ్ రజిని, ఉప సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు కొండేరు నాగభూషణం, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: