మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలో ములుగు ఎంపీపీ
గండ్రకోట శ్రీదేవి సుదీర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫౌండ్ 48,500/-రూపాయల చెక్కును బైకని ఓదేలుకు ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ అందజేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ,
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలకు ఆర్థికంగా తోడ్పాటు నిస్తూ పేదలకు సంజీవిని గా పనిచేస్తుంది అని కొనియాడారు.
కరోన సమయంలో ఆరోగ్య పరిస్థితి బాగోలేక అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయి ఆర్థికంగా నష్టపోయిన వారికి ఆదుకునే లక్ష్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థికంగా ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు.
ములుగు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందజేశామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ కో- ఆప్షన్ రియాజ్ మీర్జా,మల్లంపల్లి సర్పంచ్ చందా కుమార్ స్వామి,
ములుగు జిల్లా నాయకులు పోరిక గోవింద్ నాయక్,మైనార్టీ నాయకులు తహిర్ పాషా,జిల్లా తెరాస నాయకులు బొచ్చు సమ్మయ్య,సానికొమ్ము రాజ శ్రీ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: