CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోన బాధిత కుటుంబాలకు ఉచిత అన్న దాన కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్

Share it:

 


*ఉచిత అన్నదాన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ములుగు ఏఎస్పి సాయి చైతన్య. 

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ వైద్యశాల యందు కరోనా వ్యాధితో బాధపడుతున్న పేషెంట్ల బంధువులకు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్  21 రోజుల నుండి ఉచిత అన్న దాన కార్యక్రమం నిర్వహిస్తున్నందున అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ములుగు జిల్లా ఏఎస్పీసాయి చైతన్య హాజరై మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా బాధిత కుటుంబాలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మంచి ఉన్నతమైన కార్యక్రమం అని కొనియాడారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల ఆకలిని తీరుస్తున్న గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తన వంతుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని అన్నారు. అలాగే ములుగు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాన్ని చేయిచుకుంటున్న పేషెంట్ల బంధువులు లాక్ డౌన్ కారణంగా భోజన సదుపాయాలు లేక,రవాణా సదుపాయాలు లేక భోజన హోటళ్లు మూసివేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రహించి వారికి 21రోజుల నుండి తన వంతు సహాయంగా ఉచిత అన్న దాన కార్యక్రమం నిర్వహించి ప్రజల కడుపు నింపుతున్న రాజేందర్ గౌడ్ మరియు వారి మిత్ర బృందం వారి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని అన్నారు. అలాగే అందరూ కూడా ఇలాంటి మంచి పనులు చేస్తూ ఆపదలో ఉన్న సాటి మనుషులను ఆదుకోవాలని సూచించారు.

అనంతరం రాజేందర్ గౌడ్ ను శాలువా తో సన్మానించిన ఏఎస్పి సాయి చైతన్య. 

ఈ కార్యకమంలో ఏరియా హాస్పటల్ సూపర్డెంట్ జగదీష్ కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనేటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: