CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఘనంగా సన్మానం

Share it:

 



కరోనా బాధితులకు గ్రామ గ్రామానికి నిత్య అవసరసరుకులు అందజేత

మన్యం టీవీ మంగపేట.


కరోనా బాధితులకు బియ్యం నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు పంపిణీ చేసిన  తెరాస పార్టీ  ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవిందానాయక్

  మంగపేట మండలంలో(కొత్తపేట) చేరుపల్లి గ్రామంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ  అధ్యక్షతన కరోనా బాధిత కుటుంబాలకు బియ్యం నిత్యావసర వస్తువులు కోడిగుడ్డు   పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస పార్టీ ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవిందానాయక్ హాజరై  నిత్యావసరవస్తువులు పంపిణీ చేశారు .వారు మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తి భయపడకుండా ,ధైర్యం ఉండాలని  అన్నారు.డాక్టర్ల చెప్పిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా తెలియజేసారు.

.కాంగ్రెస్ నాయకులు సోయిలేకుండా మాట్లాడుతున్నారో కనీసం వారికే తెలియని గంధరగోళంలో ఉన్నారు. కేంద్రంలో ఏ రాష్టంకూడాఇంత గొప్పగా కరోనా కష్టకాలంలో పని చేయని విధంగా  మన తెలంగాణ రాష్టం ముఖ్యమంత్రి  చేస్తున్నారు అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో 50 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి దే అని ఈ సందర్బంగా గుర్తు చేసారు.

కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్యప్రచారాలు ప్రజలు నమ్మరు , కనీస అవగాహన కూడ లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెపుతున్నారు అని ఎద్దేవాచేశారు.కరోనా కష్ట కాలంలో  కూడా రైతులందరి దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు. అలుపుఎరగ కుండ సేవలు చేస్తున్న ఏ ఎన్ ఎం లు,ఆశవర్కర్స్ ను పోరిక గోవిందా నాయక్ చేతుల మీదుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ను సన్మానించినారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవిందానాయక్  ,మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్,, మండల పార్టీ ఉపాధ్యక్షులు  చిట్టిమల్ల సమ్మయ్య,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు అచ్చ సత్యనారాయణ, సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,, మండల ఉపాధ్యక్షులు పబ్బోజు సత్యనారాయణ,పోరిక.శ్యామాల్ నాయక్, కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు బట్ట నర్సింహారావు,, కార్యదర్శి బాలు,, తుక్కని శ్రీనువాస్, చంద్రం, పసుపులేటి శ్రీనివాస్,,, చంద్రరావు,సాధనపల్లి చంద్రరావు,రాగం రవి,యగ్గడి అర్జున్, చిట్టిబాబు,ప్రశాంత్,కన్నా సంపత్ మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: