మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల స్థానిక 13వ నంబర్ బస్తీకి చెందిన బట్టు స్రవంతి (30) అనారోగ్యంతో హైదరాబాద్ లో మరణించింది.ఆమె భర్త గతేడాది అనారోగ్యం తో మృతి చెందారు బీటెక్ చేసిన ఆమెకు ఇద్దరు పిల్లలు శ్రీరామ్ చిట్స్ లో క్లర్క్ గా పనిచేస్తూ పిల్లల్ని పోషించి కుంటుంది.తల్లిదండ్రుల సహకారంతో అద్దె ఇంట్లో పిల్లలతో జీవిస్తుంది.కడుపునొప్పి తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.కరోనా నేపథ్యం లో అంత్యక్రియలను జరుపుటకు స్థానికులు ముందుకు రాలేదు.సీపీఎం హెల్ప్ లైన్ వారు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, సుభానీ,లక్క రాజేశ్వరరావు,వరప్రసాద్,తండ్రి రావుల సాంభయ్య, బందు మిత్రులు పాల్గొన్నారు.
Post A Comment: