హరీష్ రావు ను కలిసిన చర్ల మండల తెరాస నాయకులు
మన్యం టీవీ చర్ల:
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ను కలిసిన చర్ల మండల టిఆర్ఎస్ నాయకులు దొడ్డి తాతారావు, అనంతరం మంత్రి గారిని వారి స్వగృహంలో శాలువా కప్పి సత్కరించారు. చర్ల మండలంలో విద్యార్థుల సమస్యలను మంత్రివర్యులు ప్రశ్నించగా, చర్ల మండలం లో డిగ్రీ కళాశాల లేదని, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల విద్యార్థులు భద్రాచలం వెళ్లి చదువుకుంటున్నారని తెలియజేయడం జరిగింది. దీనిపై వెంటనే వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మంత్రి గారు స్పందించి త్వరలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనిపై తాతారావు మాస్టారు మంత్రివర్యుల కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: