మన్యం టీవీ మంగపేట.
రమనక్కపేట గ్రామానికి చెందిన కరోనా బాధిత రిపోర్టర్ జానపట్ల జయరాజు కు ఆదివారం కుసుమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల టిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ నిత్యావసర సరుకుల కిట్టు అందజేశారు. గత వారం రోజులుగా కరోనాతో రిపోర్టర్ మరియు అతని కుటుంబ సభ్యులు బాధపడుతున్న విషయం తెలుసుకున్న టిఆర్ ఎస్ పార్టీ నాయకులు బియ్యం నిత్యావసర సరుకులు, మరియు గుడ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తులు మనో ధైర్యం కోల్పోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, మరియు యూత్ నాయకులు నరహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: