మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు దేశంలోనే రైతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం కెసిఆర్ అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే చేతులమీదుగా రైతులకు రాయితీ విత్తనాలు, రైతు బీమాచెక్కులు పంపిణీ చేశారు. మండలంలో సుమారు 10,310 మందికి కి రైతుబంధు 95 మందికి రైతు బీమా అందించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిది అన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్ రైతు రాష్ట్ర సలహాదారులు పులిగండ్ల మాధవరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, ఏడిఏ వాసవిరాణి, ఏవో సతీష్, కోటేశ్వరరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: