గుండాల (మన్యం టీవీ) కల్యాణ లక్ష్మి చెక్కులను తాసిల్దార్ రంగు రమేష్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తొలుత తాసిల్దార్ కార్యాలయంలో ఒకరికి పంపిణీ చేసి అనంతరం ఇంటి ఇంటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం తాసిల్దార్ రమేష్ మాట్లాడుతూ. ప్రభుత్వం పేదల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులు మంజూరయ్యాయని అన్నారు. కరోనా కారణంగా చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేస్తున్న మన్నారు . మొత్తం 35 చెక్కులు రాగా వాటన్నిటిని లబ్ధిదారుల ఇంటికి తిరిగి అందించామన్నారు. ఈ కార్యక్రమంలో . ఆర్ ఐ లు బి నాగేశ్వరరావు , టి జోగయ్య , సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి రావు , వీఆర్వోలు రత్తయ్య , గజేంద్ర రావు , నాగేశ్వరరావు , వీఆర్ఏలు లక్ష్మణ్ , శివాజీ , సారయ్య లు పాల్గొన్నారు
Post A Comment: