CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పొదుమూరు గ్రామానికి అండగా ఉంటానన్న కుసుమ జగదీశ్ కు పాలాభిషేకం

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలం పొదుమూరు గ్రామానికి తోడుగా అండగా ఉంటాను అన్న జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కు మంగపేట మండల నాయకులకు పొదుమూరు గ్రామ ప్రజలు ఎస్సీ.బీసీ.మైనార్టీ.ప్రజలు  ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జి గుగిళ్ళ సురేష్ మాదిగ  తరపునఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేసి జగదీశ్ ఫోటోకు పాలాభిషేకం చేసారు.పొదుమూరు ఇంటి స్థలాలు, మోడల్ బెడ్ రూములు కట్టిస్తాను అని 13.06.2021 నాడు ఆంధ్రప్రభ దినపత్రిక ముఖంగా కుసుమ జగదీశ్ వాగ్దానం ఇచ్చారు. అదికార్లతో కూడా మాట్లాడినందుకు పొదుమూరు గ్రామ ప్రజలు అందరు కుసుమ జగదీశ్కు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటాము, కుసుమ అన్నకు హృదయాల్లో స్థానం కల్పించి కొలుస్తాము, ఇంత గొప్ప సహాయం చేసిన అన్నకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అని ఈ సందర్బంగా తెలియజేసారు.ఈ సందర్బంగా గ్రామ ప్రజలు కుసుమజగదీశ్ కు పత్రిక ముఖంగా మాకు అతి తొందరగా స్థలం చూపించి మోడల్ బెడ్రూంలు త్వరగా అవునట్లుగా చేయాలని కోరారు.కుసుమ ఇచ్చిన మాటకు కుసుమ జగదీశ్ ఫోటోకి  పాలాబీషేకం చేసారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, మంగపేట ఎమ్మార్పిఎస్ నాయకులు మండల ఇన్ ఛార్జ్ గుగ్గిళ్ల సురేష్ మాదిగ, ఎమ్మార్పిఎస్ నాయకులు కిసరి సారయ్య, గుండెట్టి జంపయ్య, ఎల్పీ పున్నారావు, ఎల్పీ ఆదినారాయణ, ఎల్లం దాసరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: