గుండాల ( మన్యం టీవీ) నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పిఆర్సి అమలు చేయాలని హెల్త్ ఐక్య వేదిక తరపున డిమాండ్ చేశారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్ల తో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం హెల్త్ ఆఫీసర్ రవిచంద్ర మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న వారందరికీ పిఆర్సి అమలు చేయాలని అన్నారు. దాని పాటు ఆశా వర్కర్లకు పదివేల రూపాయల నికర వేతనం అందించాలని అన్నారు. కరోనా కష్టకాలంలో ముందుండి కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది ని మర్చిపోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే హెల్త్ విషయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరీక్ష పరిష్కరించకుంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు , ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మాసిస్ట్ , ఆశా వర్కర్లు , ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు పాల్గొన్నారు
Post A Comment: