CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Share it:

 


👉పోడు సాగుదారులు ఇబ్బందులకు గురిచేసే అధికారులపై చర్యలు తప్పవు 

👉గిరి వికాస పథకం అమలుకు అడ్డుకున్న అధికారులు 

👉నకిలీ విత్తనాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఉండాలి 

👉భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వసభ్య సమావేశంలో విప్ కాంతారావు

మన్యం మనుగడ , భద్రాద్రి కొత్తగూడెం:

మన్యంలో పోడుకు సంబంధించి ఐ టి డి ఎ ,ఫారెస్ట్ ,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రేగా కాంతారావు సూచించారు .ఆయన శుక్రవారం సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు సాగుదారులు కి హక్కు కల్పిస్తానని ప్రకటించినప్పటికీ ..ఫారెస్ట్ అధికారులు ఆదివాసులను పోడు పేరుతో ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అండగా గిరి వికాస పథకం అమలు చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. తక్షణమే గిరి వికాస పథకం పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సీజన్  నకిలీ విత్తనాలపై సంబంధిత శాఖ అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షత వహించగా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ సీఈవో విద్యా లత, జడ్పీటీసీలు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.

Share it:

Post A Comment: