తెలంగాణలో పీసీసీ, వివిధ కమిటీల నియమాకంపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి పీసీసీ దక్కబోతుంది, ఎవరికి వివిధ పదవులు వరిస్తాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగానే తాజాగా తెలంగాణ రాష్ట్ర నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లి ముదిరాజ్ను నియమించింది అధిష్టానం. ఆమె ఎన్నికను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీ ధృవీకరించడంతో ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి రేసులో భవానీ రెడ్డి, ఇందిరా రావు, కాల్వ సుజాతలు ఉన్నప్పటికీ చివరికి ఈ పదవి సునీతాకే దక్కింది.
అయితే గతంతో పీసీసీ అధికార ప్రతినిధిగా, నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా, NSUIతోపాటు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన సునీతా ప్రస్తుతం అడ్వకేట్గా ఉన్నారు.
పార్టీకి విధేయురాలిగా పని చేస్తు, మహిళా సమస్యలపై సునీతాకు సంపూర్ణ అవగాహన ఉండడంతో ఆమె పేరును రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అధిష్టానం ఫైనల్ చేసింది. అయితే సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న నేరెళ్ల శారద గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో కొత్త మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Post A Comment: