మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని టేకులపల్లి మండల సీజనల్ వ్యాధుల వ్యాప్తి పొంచి ఉన్న తరుణంలో ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం అయినా ఈ మేరకు మండలంలోని తూర్పుగూడెం, సబ్ సెంటర్ తనిఖీ చేశారు. వర్షాకాలంలో ప్రతి ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సోనాక్షి, హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం లు కళావతి, సైదమ్మ, మంగతాయారు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: