మన్యం టీవీ కొత్తగూడెం :-
ఈరోజు జూన్ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం, ప్రతి ఏటా జూన్ 12 న నిర్వహించబడుతుంది బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది, ఈ సందర్భంగా లక్ష్మీదేవి పల్లి మండలం లో సిపిఐ ఐ ఎన్ ఎఫ్ ఐ డబల్య మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరిష రత్నకుమారి మాట్లాడుతూ పేదరికంతో పూట గడవక ఎన్నో పేద కుటుంబాలు పిల్లలను ఇటుక బట్టీల పనికి కూలి పనికి పంపిస్తున్నారు. బలపం పట్టాల్సిన చేతులతో బండ చాకిరీ చేపిస్తూ పసి జీవితాలను నాశనం చేస్తున్నారు. అలాంటివారు ఎవరైనా ఉంటే వారికి అర్థమయ్యేలా చెప్పి వారిని హాస్టల్ లో కానీ ప్రభుత్వ పాఠశాలలో గాని చేర్పించ వలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది ఈనాటి బాలలే రేపటి పౌరులు గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై గ్రామ పెద్దల పై ఉంటుంది. బాలలు కూడా ఎంతో సంతోషంగా మేము కూడా మంచిగా చదువుకొని మీలా ప్రయోజకులుగా అవుతామని సంతోషం వ్యక్తపరిచారు, అనంతరం వారికి కోడిగుడ్డు తో కూడిన భోజనం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాణి, స్వరూప ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: