మన్యం టీవీ, పినపాక: పినపాక మండలం గోపాలరావు పేట గ్రామం లో జలగం గోపయ్య అనే గీత కార్మికుడు నెల రోజుల క్రితం తాటి చెట్టు పైనుండి పడడం వల్ల తన రెండు కళ్ళు విరిగి మంచానికి పరిమితమయ్యాడు. కుటుంబం పరిస్థితి దీన స్థితిలో పడిపోయింది ఈ విషయం తెలుసుకున్న మానవ సేవ యూత్ తక్షణమే స్పందించి ప్రస్తుతం ఆకలి బాధని తీర్చడానికి 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు అందించి త్వరలో వారికి వైద్యానికి సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తామని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవ సేవా యూత్ అధ్యక్షులు జూపూడి సుబ్బారావు, సభ్యులు జైబీమ్ రామ్, మోహన్ దుర్గం నర్సింహ రావు జాదపట్ల జయరాజ్, చేట్టిపెళ్లి ముకుందం ఎర్ర శ్రవణ్ కుమార్, బోడ ప్రవీణ్ గ్రామ ప్రజలు ఉగ్రరపు వెంకటేశ్వర్లు, ఇరసవండ్ల శ్రీనివాస్, బండగొర్ల అశోక్, అనిపెద్ది జంపయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: