ఈరోజు మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మున్సిపల్ పరిధిలో గల రామవరం 6వ వార్డు నందు మొక్కను నాటడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాo దెబ్బతినకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవరాశి బ్రతికే విధంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది అడవులను నరక కుంట చెట్లను పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఒక చెట్టు పెట్టి వచ్చిన బంధుమిత్రులతో కూడా చెట్లు పెట్టించాలని అలాగే ప్లాస్టిక్ వాడకం మన వంతుగా మనమే వాడటం నిర్మూలించాలని చెప్పడం జరిగింది. ఈనాటి నుండి ఎవరైనా మార్కెట్లో పరిమిషన్ లేని ప్లాస్టిక్ ని విక్రయిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అన్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని మరి జీవ రాశులను కాపాడుకుందామని కావున ప్రతి ఒక్కరు ఇది ఒక్క బాధ్యతగా చేపట్టి ఒక మొక్కను నాటాలని ఈ సందర్భంగా కోరారు.
Post A Comment: