CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులకు అందుబాటులో వ్యవసాయ పరికరాలు

Share it:

 



👉🏻ఏ డీ ఏ తాతారావు.


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల రైతుల సౌకర్యార్థం ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన వ్యవసాయ పరికరాలను మండల కేంద్రమైన అశ్వాపురంలో అందుబాటులోకి వచ్చాయని మణుగూరు ఏ డీ ఏ తాతారావు,అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత అన్నారు.అశ్వాపురంలో గురువారం నాడు ఎస్ ఆర్ కె మన అగ్రిటెక్ నిర్వాహుకులు రాళ్లబండి కళ్యాణ్ ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాటరీ స్ప్రేయర్స్,తైవాన్ స్ప్రేయర్స్,టార్పాలిన్ లు,డ్రమ్ సీడర్, పోర్టబుల్ స్ప్రేయర్స్,బ్రష్ కట్టర్స్,పొగ మిషన్స్,పవర్ వీడర్స్, కల్టీవేటర్స్,రోటా వేటర్స్,సిమ్ స్టాటర్స్,మల్చింగ్ షీట్స్, వన్ హెచ్ పి, ఫై హెచ్పిమోటార్స్,ట్రాక్టర్ ఎటాచ్ మెంట్స్ మరియు ఇతర పరికరాలు అందుబాటులో ఉంటాయని ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం మండల కేంద్రంలో మొట్టమొదటి షాప్ అని అన్నారు.ఈ రోజు నుండి రైతులకు ఈ విధమైన పరికరాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ భువనేశ్వరి,గొందిగూడెం కొత్తూరు సర్పంచ్ పర్షిక సూరిబాబు,అశ్వాపురం ఉప-సర్పంచ్భూక్యా చందు లాల్,టీఆర్ఎస్ పార్టీ యువజన నాయుకులు వలబోజు మురళి,మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: