ప్రేమ వ్యవహారమే కారణం అంటున్న గ్రామస్తులు.
చండ్రుగొండమన్యం టీవీ ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం కర్సలబోడు గ్రామంలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కర్సలబోడు గ్రామానికి చెందిన బోడ వినోద్ కుమార్(23 సం) యువకుడు ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో విగతజీవిగా అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా బిగ్గరగా కేకలు వేస్తూ రోదించారు. ఏం జరిగిందో అని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని చూసేసరికి వినోద్ మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే వినోద్ కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి అనుమానం వ్యక్తం చేసిన వారి ఇంటి ముందు పడుకోబెట్టి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టన్ నిమిత్తం తరలించారు. జరిగిన సంఘటనపై ఎస్ఐ బి రాజేష్ కుమార్ మృతిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పదం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జూలూరుపాడు సీఐ ఎం నాగరాజు ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. ఈకార్యక్రమంలో జూలూరుపాడు ఎస్ఐ శ్రీకాంత్, చండ్రుగొండ ట్రైనీ ఎస్ఐ యస్కే నాగుల్ మీరా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: